telugu navyamedia
వార్తలు సినిమా వార్తలు

దుబాయ్ లో సూపర్ స్టార్ ఫ్యామిలీ…

సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ పేరు తెలియని తెలుగు ప్రేక్షకుడు ఉండడు. ఇక సూపర్ స్టార్ మహేష్ సోషల్ మీడియాలోనూ చాలా యాక్టివ్ గా ఉంటాడు. మహేష్ బాబు సతీమణి నమ్రతా శిరోద్కర్ రేపు తన పుట్టిన రోజు వేడుకలను దుబాయ్ లో జరుపుకోనున్నారు. కాగా నేడు మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి దుబాయ్ పయనమయ్యారు. ఈమేరకు మహేష్ ఫ్యామిలీ ఎయిర్ పోర్ట్ లో కనిపించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మహేష్ ఈ టూర్ ను ముగించుకున్న వెంటనే ‘సర్కార్ వారి పాట’ షూటింగ్ లో బిజీ కానున్నారు. పరశురామ్ దర్శకత్వం వహిస్తుండగా, కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించనుంది. కరోనా తరువాత అన్ని సినిమాలు షూటింగ్ లు, పోస్టర్లు, టీజర్లు అప్డేట్ ఇస్తుండగా,సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలో ప్రారంభం కానుంది. ఈ సినిమాలో అందాల భామ కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఇక ఈ సినిమాలో మహేష్ న్యూ లుక్ లో కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదల అయిన ప్రీ లుక్ లో మహేష్ ట్యాటూ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది.

Related posts