టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నేడు (ఆగష్టు 9) న పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. దీంతో ఆయన ఫ్యాన్స్లో సందడి మొదలైంది. ఇక ఆయన నటిస్తున్న సినిమా నుంచి ఇస్తున్న అప్డేట్స్ సోషల్ మీడియాను కుదిపేస్తున్నాయి. మహేష్ బర్త్డే బ్లస్టర్ పేరుతో నేడు ‘సర్కారువారి పాట’ టీజర్ ను విడుదల చేయబోతున్నారు. ఈ టీజర్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఉత్సహంగా ఎదురు చూస్తున్నారు. కాగా మహేష్ బాబు తన బర్త్డే సందర్భంగా తన ఫ్యాన్స్ని గ్రీన్ ఛాలెంజ్లో భాగం కావాల్సిందిగా పిలువును ఇచ్చాడు. తన అభిమానులు కనీసం 3 మొక్కలు నాటి సెల్ఫీ దిగి తనకు షేర్ చేయమని మహేష్ వెల్లడించారు.
1975 లో కృష్ణ, ఇందిర దేవి దంపతులకు జన్మించారు. టాలీవుడ్లో ఘట్టమనేని కృష్ణ వారసుడిగా బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చాడు మహేష్. బాలనటుడిగా.. పోరాటం, శంఖారావం, బజార్ రౌడీ, ముగ్గురు కొడుకులు, గూడచారి 117, కొడుకు దిద్దిన కాపురం, బాలచంద్రుడు, అన్న-తమ్ముడు వంటి 8 కి పైగా సినిమాల్లో నటించాడు. 1999లో రాజకుమారుడు సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఇప్పటి వరకు 25కి పైగా సినిమాలు చేశారు. అతడు, రాకుమారుడు, యువరాజు, టక్కరి దొంగ, అతిథి, దూకుడు, మహర్షి, శ్రీమంతుడు, భరత్ అనే నేను, సరిలేరు నీకెవ్వరు వంటి సినిమాలతో ప్రేక్షకుల్లో తన క్రేజ్ను మరింత పెంచుకున్నాడు. టాలీవుడ్ హీరో వెంకటేష్తో కలిసి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ మల్టీస్టారర్ సినిమాతో ఫ్యామిలీ టచ్ కూడా ఇచ్చాడు.
2003 లో వచ్చిన ‘నిజం’ సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నారు. 2005 ఫిబ్రవరిలో నటి, మాజీ మిస్ ఇండియా నమ్రతా శిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు గౌతమ్ కృష్ణ, సితార. ప్రస్తుతం మహేశ్ బాబు పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ షూటింగ్ అనంతరం త్రివిక్రమ్తో కలిసి ఓ సినిమా చేయబోతున్నాడు.