telugu navyamedia
ట్రెండింగ్ సినిమా వార్తలు

కొంత మంది ఆడవాళ్లు ఎప్పటికీ మారరు… ఖుష్బూ కామెంట్స్

Khushboo

బాలీవుడ్ హీరోయిన్ మీరా చోప్రా మంగళవారం ట్విట్టర్‌లో #AskMeera సెషన్ పెట్టారు. అభిమానులతో కాసేపు ముచ్చటించారు. ఈ సెషన్‌లో భాగంగా ఎన్టీఆర్ గురించి ఒక మాట చెప్పమని ఆయన అభిమాని కోరాడు. దీనికి ఆమె సమాధానం ఇస్తూ.. ‘‘ఆయనెవరో నాకు తెలీదు. నేను ఆయన అభిమానిని కాదు’’ అని పేర్కొన్నారు. అక్కడితో ఆగకుండా ఎన్టీఆర్ కన్నా తనకు మహేష్ బాబు అంటే చాలా ఇష్టం అని వెల్లడించారు. దీంతో ఎన్టీఆర్ అభిమానులకు కాలింది. తీవ్ర స్థాయిలో మీరా చోప్రాపై ధ్వజమెత్తారు. ట్విట్టర్‌లో ఇష్టమొచ్చినట్టు మీరాను బూతులు తిట్టారు. ఆమెను పోర్ట్ స్టార్‌గా అభివర్ణించారు. అసభ్యకర పదజాలంతో విరుచుకుపడ్డారు. దీనిపై మీరా చోప్రా ట్విట్టర్‌లో పెద్ద ఉద్యమమే లేవదీశారు. ఎన్టీఆర్ దీనిపై స్పందించాలని, ఆయన అభిమానులను అదుపులో పెట్టుకోవాలని ట్విట్టర్‌లో ట్యాగ్ చేసి మరీ డిమాండ్ చేశారు. మీరా చోప్రాకు చిన్మయి లాంటి కొంత మంది తమ మద్దతు తెలిపారు. ఆయా ట్విట్టర్ అకౌంట్లపై ఫిర్యాదు చేయాలని మీరాకు చిన్మయి సూచించారు. మొత్తం మీద ఆ ట్వీట్టన్నింటినీ స్క్రీన్ షాట్లు తీసి సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశారు మీరా. ఇలాంటి సమయంలో సీనియర్ నటి ఖుష్బూ.. ఎన్టీఆర్ అభిమానులకు అండగా నిలిచారు. స్వతహాగా జూనియర్ ఎన్టీఆర్‌కు వీరాభిమాని అయిన ఖుష్బూ.. పరోక్షంగా మీరా ప్రవర్తనను తప్పుబట్టారు. ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. ‘‘కొంత మంది ఆడవాళ్లు ఎప్పటికీ మారరు లేదా ఏమీ నేర్చుకోరు. వాళ్లను అలానే ఉండనివ్వండి’’ అని ఖుష్బూ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. ఈ ట్వీట్‌లో ఆమె పేరు వాడకపోయినా… ఇది మీరాను ఉద్దేశించేనని అర్థమవుతోంది. ఎన్టీఆర్ ఫ్యాన్స్ కూడా ఇదే విషయాన్ని కామెంట్ల ద్వారా చెబుతున్నారు. ఖుష్బూకి ధన్యవాదాలు చెబుతున్నారు. ఆమె తమకు అండగా నిలిచినందుకు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

Related posts