పరశురాం దర్శకత్వంలో తెరకెక్కనున్న సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా ‘సర్కారు వారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జి.మహేష్ బాబు ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపి ఆచంట సంయుక్తంగా ‘సర్కారు వారి పాట’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. థమన్ సంగీతం సమకూర్చుతుండగా, జి.ఎస్.వినోద్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. మహేష్ కెరీర్లో 27వ సినిమాగా రూపొందుతున్న ఈ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ చిత్రంలో కీర్తి సురేశ్ కథానాయికగా నటిస్తున్న విషయం విదితమే. ఈ సినిమాలో మహేష్ రెండు డిఫరెంట్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తుంది. ఈ సినిమా త్వరలోనే యు.ఎస్లో చిత్రీకరణ జరుపుకోనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆ సినిమా ఫారిన్ కో ఆర్టినేటర్ గోపీ కృష్ణ నర్రావుల గురించి మహేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. “గోపీ కృష్ణ నర్రావులగారికి లైన్ ప్రొడ్యూసర్గా, ఫారిన్ కో ఆర్టినేటర్గా నా ‘సర్కారువారి పాట’ 100వ చిత్రమని తెలిసింది. 1988లో విడుదలైన ‘బజారురౌడీ’తో ఆయన ప్రయాణం ప్రారంభమైంది. మా సినీ కుటుంబంలో హార్డ్ వర్కర్, డేడికేషన్ ఉన్న వ్యక్తుల్లో ఆయన ఒకరు. ఇన్నేళ్ల ప్రయాణంలో ఆయన ఎన్నో మధుర జ్ఞాపకాలున్నాయి. ఆయనకు అభినందనలు. మీ ప్రయాణం ఇంతే గొప్పగా సాగాలని కోరుకుంటున్నాను” అంటూ ట్వీట్ చేశారు మహేష్.
previous post
next post