telugu navyamedia
రాజకీయ

మహారాష్ట్ర రాజకీయం: బలపరీక్షలో నెగ్గిన సీఎం షిండే స‌ర్కార్ ..ఉద్ధవ్‌కు షాక్

మహారాష్ట్ర రాజకీయ సంక్షోభానికి తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన శివసేన తిరుగుబాటు నాయకుడు ఏక్​నాథ్​ శిందే బలపరీక్షలో మెజారిటీని నిరూపించుకున్నారు

అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం నిర్వహించిన బలపరీక్షలో సీఎం షిండే నెగ్గారు.ఆయనకు శివసేన రెబల్ ఎమ్మెల్యేలతో పాటు, బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు తెలిపారు. .

శివసేన–బీజేపీ సంకీర్ణ ప్రభుత్వానికి అనుకూలంగా 164 ఎమ్మెల​ మద్దతు లభించింది. విశ్వాస పరీక్షలో​ ప్ర‌తిప‌క్షానికి 99 ఓట్లు పోల‌య్యాయి. ఎమ్మెల్యేల లెక్కింపు ద్వారా మెజారిటీని తేల్చారు.

ఇక ..అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో మహారాష్ట్ర నూతన స్పీకర్‌గా ఆదివారం బీజేపీ అభ్యర్థి రాహుల్‌ నార్వేకర్‌ ఎన్నికైయ్యారు . ఎంవీఏ త‌రుఫున పోటీ చేసిన ఎమ్మెల్యే రాజన్ సాల్వీ ఓడిపోయారు.

రాహుల్‌ నార్వేకర్‌ 164 ఓట్లు రాగా, మహా వికాస్‌ అఘాడీ(ఎంవీఏ) అభ్యర్థి, శివసేన ఎమ్మెల్యే రాజన్‌ సాల్వీకి కేవలం 107 ఓట్లు పోలయ్యాయి

జూన్​30న ఆ రాష్ట్ర గవర్నర్ సమక్షంలో ముఖ్యమంత్రిగా ఏక్​నాథ్ శిందే ప్రమాణస్వీకారం చేయగా.. డిప్యూటీ సీఎంగా భాజపా నేత దేవేంద్ర ఫడ్న‌వీస్ ప్రమాణస్వీకారం చేసిన విష‌యం తెలిసిందే.

మరోవైపు, శివసేన చీఫ్​ విప్​గా ఉన్న ఠాక్రే వర్గానికి చెందిన సునీల్​ ప్రభును తొలగించి.. భరత్​ గోగావలేను నియమించారు. అయితే, ఈ నిర్ణయంపై ఠాక్రే వర్గం సుప్రీంకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది. ఈ పిటిషన్​పై​ జులై 11న విచారణ చేపట్టనున్నట్లు ధర్మాసం తెలిపింది.

Related posts