వలస కొలీలు తమ స్వస్థలాలకు వెళ్లేందుకు కేంద్రం అనుమతించడంతో ఏపీలోని ఇతర జిల్లాల్లో ఉన్న వలసకూలీలను తమ సొంత గ్రామాలకు తరలించే ప్రక్రియను ప్రభుత్వం ప్రారంభించింది. ప్రభుత్వం సొంత ఖర్చుతో ఆర్టీసీ బస్సుల్లో కార్మికులను తరలిస్తోంది. ముందుగా వలసకూలీలకు వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం అధికారులు వారిని తరలిస్తున్నారు. గుంటూరు నుంచి 11,554 మంది కర్నూలు జిల్లా కూలీలను తరలించారు.
అలాగే ఇతర రాష్ట్రాల్లో ఉన్న కూలీల తరలింపునకు ఆయా ప్రభుత్వాలకు ఏపీ సర్కార్ లేఖలు రాసింది. రాష్ట్రంలోని వలస కార్మికులు నిర్మాణ, ఇటుకబట్టి, వ్యవసాయ, పారిశ్రామిక తదితర రంగాల్లో కార్మికులుగా, కూలీలుగా పని చేస్తున్నారు. లాక్డౌన్ నుంచి తినేందుకు తిండిలేక, చేసేందుకు పనిలేక ఇబ్బందులు పడుతున్న కొంత మంది ఇప్పటికే కాలి నడకన స్వస్థలాలకు చేరుకున్నారు.