telugu navyamedia
క్రైమ్ వార్తలు ట్రెండింగ్ వార్తలు

దారుణం : హైదరాబాద్ మెట్రోస్టేషన్‌ దగ్గర దారుణ హత్య..

దీపావళి పర్వదినాన భాగ్యనగరంలో దారుణం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని నారాయణగూడ మెట్రోస్టేషన్‌ కింద గుర్తు తెలియని వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. దీంతో అక్కడ ఉన్న స్థానికులు భయాందోళనకు గురయ్యారు. అయితే.. ఈ హత్యను చూసిన మెట్రో ప్రయాణికులు కంట్రోల్‌ రూంకు సమాచారం అందించారు. సమాచారం అందడంతో ఘటనా స్థలానికి నారాయణగూడ పోలీసులు చేరుకున్నారు. క్లూస్‌ టీమ్‌ సహాయంతో ఆధారాలు పోలీసులు సేకరించారు. మద్యం మత్తులో వైట్నర్‌ ల కోసం ఇద్దరి మధ్య గొడవ జరిగినట్టు సమాచారం. ఈ గొడవలో ఓ వ్యక్తి మరో వ్యక్తి తలపై బండరాయితో కొట్టడంతో అక్కడిక్కడే మృతి చెందాని ప్రాథమిక విచారణలో నారాయణగూడ పోలీసులు తేల్చారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు పోలీసులు. ఇక అటు హత్య చేసిన వ్యక్తి కోసం గాలింపు చర్యలు చేపట్టారు నారాయణగూడ పోలీసులు. ఈ ఘటన మెట్రోస్టేషన్‌ పక్కనే జరగడంతో అక్కడ ఉన్న ప్రయాణికులు ఆందోళన చెందారు.

Related posts