అనీల్ రావిపూడి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న చిత్రం “సరిలేరు నీకెవ్వరు”. 90లలో లేడీ సూపర్స్టార్గా అద్భుతమైన స్టార్డమ్ సంపాదించిన విజయశాంతి మళ్ళీ 13 ఏళ్ళ తర్వాత “సరిలేరు” నీకెవ్వరు అనే చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తుండడంతో ఈ సినిమాపై ఆమె అభిమానులలో చాలా ఆసక్తి నెలకొంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సరిలేరు నీకెవ్వరు చిత్రంలో మహేష్ మేజర్ అజయ్ కృష్ణ పాత్రలో కనిపించనున్నారు. ఆయన సరసన రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. చిత్రాన్ని దిల్ రాజు, అనిల్ సుంకర, మహేష్ సంయుక్తంగా నిర్మిస్తుండగా, సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఈ చిత్రంలో శ్రీమణి సాహిత్యం అందించిన “హీ ఈజ్ సో క్యూట్” పాటను సోమవారం విడుదల చేశారు. సంక్రాంతి సందర్భంగా జనవరి 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ జనవరి 5న హైదరాబాద్ ఎల్బి స్టేడియంలో నిర్వహించనున్నారు.
previous post
బిగ్బాస్ సీజన్ 4పై నాగార్జున ఎమోషనల్ కామెంట్..