ఇటీవల అఖిల బ్రాహ్మణ మహాసభకు ముఖ్య అతిథిగా హాజరైన ఓం బిర్లా బ్రాహ్మణ కులానికి అనుకూలంగా వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. “సమాజంలో బ్రాహ్మణులకు ఉన్నతస్థానం ఉంది. ఇది ఆయన (పరుశురాముడుని ఉద్దేశిస్తూ) త్యాగం, తప్పస్సు కారణంగా ప్రాప్తించింది. ఈ కారణంతో ఎప్పుడూ బ్రాహ్మణులు సమాజంలో మార్గదర్శకత్వం వహించే కీలక భూమికను పోషిస్తున్నారు” అంటూ ఓం బిర్లా ట్వీట్ చేశారు. ఓ బాధ్యాతమయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు ఎలా చేస్తారు? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్న తరుణంలో..వారికి మద్దతుగా టాలీవుడ్ హీరోయిన్ లావణ్య త్రిపాఠి కూడా ట్విట్టర్ ద్వారా ఆయనకు కౌంటర్ ఇచ్చారు. “నేను బ్రాహ్మణ కులానికి చెందిన వ్యక్తిని. అయితే కొందరు బ్రాహ్మణులకు మాత్రం మేం గొప్ప అనే ఫీలింగ్ ఎందుకు ఉంటుందో? అర్థం కావడం లేదు. నువ్వు చేసే పనులను అనుసరించే నువ్వు గొప్పవాడివి అవుతావు. కానీ నీ కులం వల్ల కాదు” అంటూ లావణ్య ట్వీట్ చేశారు. అయితే తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయని అనుకుందో ఏమో!. ట్వీట్ను డిలీజ్ చేసింది లావణ్య. దీంతో నెటిజన్లు నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని వెల్లడించినప్పుడు భయపడి ట్వీట్ ఎందుకు డిలీట్ చేయాల్సి వచ్చిందని ఆమెపై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. నెటిజన్ల ప్రశ్నలపై స్పందించిన లావణ్య అనవసరంగా ఇతరుల మనోభావాలను దెబ్బతీసి వివాదంలో చిక్కుకోకూడదని ఆ ట్వీట్ తొలగించినట్లు చెప్పుకొచ్చింది. ఒక్కోసారి ఇలాంటి ట్వీట్లు తప్పుడు అర్ధాలకు దారి తీస్తాయని అన్నారు. ఆ ట్వీట్ డిలీట్ చేసినప్పటికీ తాను కులం, మతం కంటే మనం చేసే పనుల ద్వారానే మన మంచితనం బయటపడుతుందని తాను నమ్ముతున్నానని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ చేతిలో సరైన అవకాశాలు లేవు. ఆమె నటించిన “అర్జున్ సురవరం” సినిమా కూడా విడుదలకు నోచుకోవడం లేదు.
previous post