సీనియర్ నటి, కాంగ్రెస్ నేత కుష్బూకి సోషల్ మీడియాలో బెదిరింపులు ఎదురయ్యాయి. దీంతో వెంటనే ఘాటుగా రియాక్ట్ అయిన కుష్బూ.. పోలీసులకు సమాచారమిచ్చి, ఏకంగా సీఎంకు ఫిర్యాదు చేస్తూ ఫైర్ అయింది. తనను రేప్ చేస్తా అంటూ ఓ వ్యక్తి బెదిరిస్తున్నాడని పేర్కొంటూ అతని ఫోన్ నెంబర్, వివరాలు బహిర్గతం చేసి పబ్లిక్గా కౌంటర్ ఇచ్చింది కుష్బూ. ట్రూ కాలర్ ద్వారా వివరాలు సేకరించిన ఆమె.. సంజయ్శర్మ అనే పేరుతో ఈ కాల్ వచ్చిందని, అది కోల్కతా నుంచి వచ్చిందని తెలుపుతూ ట్వీట్ చేసింది. కోల్కతా పోలీసులు వెంటనే దీనిపై రియాక్ట్ అయి తగిన చర్యలు తీసుకోవాలని కోరింది. అంతటితో ఆగక, ఆ వ్యక్తి వివరాలను పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ట్యాగ్ చేస్తూ ఫిర్యాదు చేసింది కుష్బూ. దీదీ నాకే ఇలాంటి బెదిరింపులు ఎదురువుతున్నాయంటే.. ఇతర మహిళల పరిస్థితి ఏంటో ఆలోచించాలని సీఎంని కోరింది కుష్బూ.
Humbly urge H’ble CM of Kolkata @MamataOfficial Didi to look into it. If it can happen to me, imagine the plight of other women.. https://t.co/DYXlRFbHnn
— KhushbuSundar ❤️ (@khushsundar) August 5, 2020
ఆ తర్వాత మరో ట్వీట్ చేస్తూ ప్రధాని ప్రధానమంత్రి నరేంద్రమోదీపై వ్యంగ్యాస్త్రాలు విసిరింది కుష్బూ. అయోధ్యలో రామ మందిరం భూమి పూజ సందర్భంగా.. బాల రాముడి చేయి పట్టుకుని మందిరం వైపు నడిపిస్తున్న ప్రధాని మోదీ చిత్రం ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీనిని పోస్ట్ చేసిన కుష్బూ.. ”వావ్! ఇప్పుడు లార్డ్ రాముడి కంటే మోదీ పెద్దవాడయ్యారు. కలియుగం మరి” అంటూ వెటకారంగా కామెంట్ చేసింది.
Wow..so now #Modi is larger than #LordRam. Kya kalyug hai. https://t.co/wXUnCPAUKV
— KhushbuSundar ❤️ (@khushsundar) August 5, 2020