కోలీవుడ్ నటుడు శరత్ కుమార్ పేరు వాడుతూ ఓ వ్యక్తి అక్రమంగా వసూళ్లకు పాల్పడుతున్నట్లు తాజాగా వెలుగులోకి వచ్చింది. శరత్ కుమార్ ‘అఖిల భారత సమత్తుల మక్కల్ కట్చి’ పేరుతో ఓ పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. ఈ పార్టీ పేరు చెప్పి ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆన్లైన్ మోసాలకు పాల్పడుతున్నారట. ఈ విషయం శరత్ కుమార్ దృష్టికి రావడంతో వెంటనే అలర్ట్ అయిన ఆయన, స్వయంగా తానే రంగంలోకి దిగి ఆ వ్యక్తి వివరాలు ఆరాదీసి అతనితో ఫోన్లో మాట్లాడి హెచ్చరించారు. అతను కోవైకి చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ అని తెలుసుకుని పోలీసులను ఆశ్రయించారు శరత్ కుమార్. ఈ మేరకు చెన్నై పోలీస్కమిషనర్కు తన ఫిర్యాదు అందించారు. ఇటీవల కాలంలో సెలెబ్రిటీల పేర్లతో ఆన్లైన్ మోసాలు ఎక్కువవుతున్నాయి. అందుకే ప్రజలు జాగ్రత్తగా ఉండడం మంచిది.
previous post