నిర్మాణరంగ కార్మికుల సంక్షేమం కోసం చర్యలు తీసుకుంటామని తెలంగాణ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ నిర్మాణరంగ సంస్థల ప్రతినిధులతో కేటీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా బిల్డింగ్, లేఔట్ల అనుమతులకు చెందిన అంశాలను నిర్మాణరంగ సంఘాల ప్రతినిధులు కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు.
ఈ నేపథ్యంలో వారి సమస్యలపై మంత్రి సానుకూలంగా స్పందించారు. సిమెంట్ ధరలు తగ్గింపుపై కంపెనీలతో చర్చించేందుకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఇసుక సరఫరా సమస్యలు పరిష్కరిస్తామని కేటీఆర్ భరోసా ఇచ్చారు. నిర్మాణ సంస్థల్లో పనిచేస్తున్న కార్మికుల పూర్తి వివరాలు సేకరించాలని సూచించారు.
సినిమా తీసిన ప్రతి హీరోతో గొడవే..పీవీపీపై బండ్ల గణేశ్ ట్వీట్