telugu navyamedia
ఆంధ్ర వార్తలు వార్తలు

కుక్క ల వ్యాన్ ఎక్కిస్తా : కొడాలి

ఎన్టీఆర్ మద్యపాన నిషేధం పెడితే చంద్రన్న బుడ్డీలు తీసుకుని వచ్చింది ఎవరు? అని మంత్రి కొడాలి ప్రశ్నించారు. అమ్మఒడి, నాడు-నేడు, ఇంగ్లీష్ విద్య, పెన్షన్లు వంటి పథకాల ద్వారా 90 వేల కోట్లను పేదలకు ఆర్థిక సహాయం చేసిన నాయకుడు జగన్ అని అన్నారు. కొబ్బరి చిప్పలు, సైకిల్ బెల్లులు ఎత్తుకు పోయిన వ్యక్తులను పక్కన పెట్టుకుని చంద్రబాబు మాట్లాడుతున్నాడని కనకదుర్గమ్మ ఆశీస్సులతో నే అదే నియోజకవర్గంలో వెల్లంపల్లి గెలిచి మంత్రి అయ్యారని అన్నారు. క్షుద్రపూజలు చేసి, అవినీతి, అక్రమాలకు పాల్పడి బట్టి దుర్గమ్మ తల్లి తండ్రి, కొడుకులకు తగిన శిక్ష విధించిందని అన్నారు. చంద్రబాబు తుప్పుగాడు‌, లోకేష్ పప్పు గాడని అన్నారు. అలానే నా జోలికి వస్తే కుక్క ల వ్యాన్ ఎక్కించి కరెంట్ షాక్ ఇప్పించి మైండ్ సెట్ చేస్తానని వార్నింగ్ ఇచ్చారు. కరోనా పేరుతో 8 నెలలు ఇంట్లో దాక్కున్న పిరికిపంద బాబు అని, ఇప్పుడు వచ్చి ప్రజలకు పౌరుషం లేదనటానికి సిగ్గు ఉండాలని అన్నారు. ఇటువంటి వెధవల్ని బట్టలూడదీసి తరిమి తరిమి కొట్టాలని కొడాలి అన్నారు. పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు, స్టీల్ ప్లాంట్… కేంద్రం అధీనంలో ఉంటాయని తెలియదా? అని ఆయన ప్రశ్నించారు. ఎందుకు బతికి ఉన్నాడో తనకే తెలియదన్న ఆయన మగాడివి అయితే మోడీ ని ప్రశ్నించాలని అన్నారు.

Related posts