telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

బీజేపీలో చేరిన టీడీపీ ఎంపీల పై కేశినేని సంచలన వ్యాఖ్యలు

Nani kesineni

ఏపీ టీడీపీ రాజ్యసభ సభ్యులు సుజనాచౌదరి, సీఎమ్ రమేష్, టీజీ వెంకటేష్ లు ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని తాము పార్టీ మారామని వాళ్లు చేసిన వ్యాఖ్యల పై విజయవాడ ఎంపీ కేశినేని నాని సోషల్ మీడియాలోసంచలన వ్యాఖ్యలు చేశారు. మీరేదో ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లోకి వెళుతున్నామని చెప్పారు. నిన్న బడ్జెట్ చూసాక ఈ రాష్ట్ర ప్రజలకు బాగా ఆర్థమైందన్నారు.

ఈ రాష్ట్రాన్ని ఉద్ధరించడానికి బీజేపీ లో చేరారో లేక మిమ్మల్ని మీరు ఉద్ధరించుకోడానికి బీజేపీలో చేరారా అని ప్రశ్నించారు. గత కొంతకాలంగా కేశినేని సోషల్ మీడియా వేదికగానే స్పందిస్తున్న సంగతి తెలిసిందే. రోజుకి ఒకరు చొప్పున టార్గెట్ చేస్తూవిమర్శలు చేస్తున్నారు. తాజాగా బీజేపీ తీర్థం పుచ్చుకున్న టీడీపీ రాజ్యసభ సభ్యుల పై నాని సోషల్ మీడియాలో విమర్శలు గుప్పించారు.

Related posts