telugu navyamedia
వార్తలు వ్యాపార వార్తలు సామాజిక

ఏటీఎం నుంచి క్యాష్‌ విత్‌డ్రాకు ఇక పై ఓటీపీ!

sbi logo

ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉన్నప్పటికీ తెలియకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఫిర్యాదులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు రావడంతో స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ఎస్‌బీఐకొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది.

జనవరి 1, 2020 నుంచి ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్‌బీఐ ఏటీఎంల నుంచి క్యాష్‌ విత్‌ డ్రా చేసుకోవాలంటే వన్‌టైం పాస్‌వర్డ్‌(ఓటీపీ)తోనే నగదు డ్రా చేసుకోగలరు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. పదివేలు, అంతకన్నా ఎక్కువ క్యాష్‌ ఉపసంహరణకు ఓటీపీ ఎంటర్‌ చేయాల్సి ఉంటుందని తెలిపింది.

Related posts