ఏటీఎం కార్డులు ఖాతాదారుల వద్ద ఉన్నప్పటికీ తెలియకుండా ఖాతా నుంచి డబ్బులు డ్రా చేస్తున్న ఫిర్యాదులు సైబర్క్రైమ్ పోలీసులకు రావడంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అప్రమత్తమైంది. ఈ నేపథ్యంలో తన వినియోగదారులకు ఎస్బీఐకొత్త ఫీచర్ను అందుబాటులోకి తీసుకురానుంది.
జనవరి 1, 2020 నుంచి ఇకపై దేశవ్యాప్తంగా అన్ని ఎస్బీఐ ఏటీఎంల నుంచి క్యాష్ విత్ డ్రా చేసుకోవాలంటే వన్టైం పాస్వర్డ్(ఓటీపీ)తోనే నగదు డ్రా చేసుకోగలరు. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటలకు ఓటీపీ విధానం వర్తిస్తుందని బ్యాంకు పేర్కొంది. పదివేలు, అంతకన్నా ఎక్కువ క్యాష్ ఉపసంహరణకు ఓటీపీ ఎంటర్ చేయాల్సి ఉంటుందని తెలిపింది.