కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం “పెంగ్విన్”. ఈ సినిమాకు ఈశ్వర్ కార్తిక్ దర్శకత్వం వహించారు. కార్తికేయన్ సంతానం, కాల్ రామన్, ఎస్.సోమసేగెర్, కళ్యాణ్ సుబ్రమణియన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. ‘పేట’ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజ్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో ఏకకాలంలో రూపొందింది. ఈ రెండు భాషలతో పాటు మలయాళంలోకి కూడా ఈ సినిమాను అనువాదం చేశారు. ఈ సినిమాను నేరుగా అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుదల చేస్తున్నారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో జూన్ 19న ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్లో విడుదల అవుతోంది. అయితే, ప్రచారంలో భాగంగా సోమవారం (జూన్ 8న) టీజర్ను విడుదల చేశారు. నలుగురు స్టార్ హీరోయిన్లు ఈ చిత్ర టీజర్ను లాంచ్ చేయడం విశేషం. స్టార్ హీరోయిన్లు తాప్సీ పన్ను, సమంత, మంజు వారియర్, త్రిష ‘పెంగ్విన్’ టీజర్ని తమ ట్విట్టర్ ఖాతాల ద్వారా విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే ఇదో సైకో థ్రిల్లర్ అని అర్థమవుతోంది. అంతేకాదు, ఇదొక తల్లి కథ. ‘తల్లికి వచ్చిన పీడకల నిజమైంది’ అని కీర్తి సురేష్ తన ట్వీట్లో పేర్కొన్నారు. జూన్ 11న విడుదలయ్యే ట్రైలర్తో సినిమా గురించి మరిన్ని ఆసక్తికర విషయాలు తెలియనున్నాయి. ‘రాక్షసుడు’ సినిమాలో క్రిస్టోఫర్ పాత్ర మాదిరిగా ఈ సినిమాలోనూ చార్లీ చాప్లిన్ వేషంలో ఒక సైకో ఉన్నాడు. వాడిని కూడా టీజర్లో పరిచయం చేశారు. సంతోష్ నారాయణన్ సంగీతం సమకూర్చారు. టీజర్లో సంతోష్ నారాయణన్ సంగీతం కూడా ప్రధాన ఆకర్షణగా కనిపిస్తోంది. మీరు కూడా ఈ టీజర్ ను వీక్షించండి.
Here we go! A mother’s worst nightmare comes true. #PenguinOnPrime premieres June 19. @PrimeVideoIN⁰⁰ @EashvarKarthic @karthiksubbaraj @Music_Santhosh @KharthikD @Anilkrish88 @SaktheeArtDir @StonebenchFilms @PassionStudios_ @kaarthekeyens @sudhans2017 @SonyMusicSouth pic.twitter.com/FAWo8peRc1
— Keerthy Suresh (@KeerthyOfficial) June 8, 2020