అనుష్క ప్రధాన పాత్రలో హేమంత్ మధుకర్ దర్శకత్వం వహించిన ప్రయోగాత్మక చిత్రం ‘నిశ్శబ్దం’. సస్పెన్స్ థ్రిల్లర్గా రూపొందిన ‘నిశ్శబ్దం’లో మాటలురాని, వినికిడి లోపం ఉన్న ఒక కళాకారిణిగా అనుష్క కనిపించింది. క్రితి ప్రసాద్ సమర్పణలో కోన ఫిల్మ్ కార్పోరేషన్ అసోసియేషన్తో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్పై టీజీ విశ్వప్రసాద్, కోన వెంకట్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుంది. ఈ భామ నుంచి ఎటువంటి అప్డేట్ రాకపోవడంతో కుర్రకారు నిరాశ చెందారు. ఈ సమయంలో అనుష్క కొత్త సినిమా గురించి వస్తున్న వార్తలు వారిలో నూతన ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అయితే ఈ ముద్దుగుమ్మ తన తదుపరి చిత్రాన్ని ప్రభాస్ హోం బ్యానర్గా పేరున్న మూవీ క్రియేషన్స్లో అనుష్క చేసేందుకు ఓకే చెప్పిందట. అంతేకాకుండా అనుష్క సినిమాను రారా కృష్ణయ్య షేమ్ దర్శకుడు పీ మహేష్ తెరకెక్కించనున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పటి వరకు దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. కానీ తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా పట్టాలెక్కేందుకు కావలసిన ఏర్పాట్లు జరుగుతున్నాయని, ఈ చిత్రం యూత్ ఎంటర్టైనర్గా కాస్త బొల్డ్ కంటెంట్తో రూపొందుతుందని అంటున్నారు. దీనిలో యంగ్ హీరో చేయనున్నాడట. దీంతో ఈ సినిమా అప్డేట్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు.
previous post