ప్రముఖ బాలీవుడ్ సింగ్ కనికా కపూర్కు కరోనా వైరస్ సోకిన విషయం తెలిసిందే. లండన్ నుంచి మార్చి 9న ఉత్తర ప్రదేశ్ వచ్చిన కనికా కపూర్ హోటల్లో బస చేసింది. ఆ క్రమంలోనే పలువురు సెలబ్రిటీలు, రాజకీయ ప్రముఖులను ఆమె కలవడమే కాకుండా పార్టీ కూడా చేసుకున్నారు. కరోనా సోకినట్లు తేలడంతో సంచలనం రేగింది. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. ప్రభుత్వం నిబంధనలు పాటించకుండా పార్టీలకు వెళ్ళడం వలన ఆమెపై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు. ఆ తర్వాత ఆమెను క్వారంటైన్లోకి పంపించారు. వరసగా నాలుగు సార్లు కరోనా పాజిటివ్ వచ్చినా.. ఐదు, ఆరోసారి ఆమెకు నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్జి చేశారు. ఉత్తర్ ప్రదేశ్లోని సంజయ్ గాంధీ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఆసుపత్రిలో ఆమె చికిత్స తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు నిర్వహించిన కరోనా నిర్ధారిత తొలి నాలుగు టెస్ట్ల్లోనూ పాజిటివ్ రావడంతో ఆందోళన వ్యక్తమయింది. అయితే ఐదు, ఆరోసారి నిర్వహించిన కరోనా నిర్ధారిత పరీక్షల్లో నెగెటివ్ రావడంతో ఆమెను డిశ్చార్ చేశారు. ఇంటికి చేరుకున్నా, వైద్యుల సూచనలమేరకు 14 రోజులపాటూ కనికా కపూర్ గృహ నిర్బంధంలోనే ఉండనున్నారు. కాగా, విదేశాల నుంచి వచ్చిన తర్వాత కనికా కపూర్ పలు వేడుకల్లో పాల్గోవడం, వాటికి రాజకీయ ప్రముఖులతోపాటు సినీ సెలబ్రిటీలు కూడా హాజరవ్వడం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. కనికాకు కరోనా సోకిందని నిర్ధారణ కాగానే ఆమెకు సన్నిహితంగా మెలిగిన వారందరూ స్వీయ నిర్బంధం విధించుకున్నారు. కనికా కపూర్కు కరోనా తగ్గిందని తెలియడంతో వీరంతా ఊపిరి పీల్చుకున్నారు.
previous post
ప్రకృతిని కాపాడుకోవాలి..నల్లమలను రక్షించుకోవాలి: నాగబాబు