telugu navyamedia
ఆంధ్ర వార్తలు ట్రెండింగ్ రాజకీయ

ఘాటు పెంచిన నారా లోకేష్ .. మోడీ ఏపీకి కాలకేయుడంటూ ..

Minister Lokesh comments YS Jagan

మంగళగిరి టీడీపీ అభ్యర్థి నారా లోకేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఘాటు పెంచారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భల్లాల దేవుడు అంటూ ప్రధాని నరేంద్రమోదీ చేసిన వ్యాఖ్యలకు లోకేష్ గట్టి కౌంటర్ గా మోదీని కాలకేయుడితో పోల్చారు. గుజరాత్‌లో నరమేధం చేసిన మోదీ భల్లాల దేవుడికి సరిసాటని పేర్కొన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా దాడి చేస్తున్న కాలకేయుడు మోదీ అని తీవ్రస్థాయిలో విమర్శించారు.

ఇంకా లోకేశ్ మాట్లాడుతూ, కేంద్రం నుంచి ఏమాత్రం సాయం లేకున్నా ఆంధ్రులను తలెత్తుకునేలా చేస్తున్న బాహుబలి చంద్రబాబని అభివర్ణించారు. ఆంధ్రప్రదేశ్ హెరిటేజ్ చూసుకోవడానికి చంద్రబాబు, హెరిటేజ్ సంస్థను చూసుకోవడానికి బ్రహ్మణి, భువనేశ్వరి ఉన్నారని లోకేశ్ వివరించారు. రూ.54 వేల కోట్లు అవసరమైన పోలవరం ప్రాజెక్టు కోసం కేవలం రూ.6 వేల కోట్లు ఇచ్చి సరిపోవడం లేదంటే ఎలా? అని ప్రశ్నిస్తూ లోకేశ్ ఘాటుగా ట్వీట్ చేశారు.

Related posts