ప్రపంచ దేశాలను కరోనా వైరస్ గజగజ వణికిస్తోంది. ఈ మహమ్మారీ తీవ్రత దేశ వ్యాప్తంగా రోజురోజుకు పెరుగుతోంది. కరోనాను కట్టడి చేసేందుకు దేశంలో లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ 21 రోజుల పాటు విధించిన లాక్డౌన్పై తన సొంత అనుభవాన్ని పంచుకున్నాడు. దీనికి సంబంధించిన ఓ వీడియోను సల్మాన్ ఖాన్ సోషల్ మీడియాలో షేర్ చేశాడు. ఈ వీడియోలో సల్మాన్, తన మేనల్లుడు నిర్వాన్తో (సోహైల్ ఖాన్ కొడుకు) కలిసి జరిపిన సంభాషణను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు. ఈ వీడియోలో సల్మాన్ మాట్లాడుతూ.. ‘మేము కొన్ని రోజుల క్రితం ఇక్కడికి వచ్చాం. ప్రస్తుతం ఇక్కడే ఇరుక్కుపోయాం’ అని పేర్కొన్నాడు. ఈ విషయంపై నిర్వాన్ను ప్రశ్నిస్తూ ‘నువ్వు మీ నాన్నను చూసి ఎంతకాలమయ్యింది’ అని అడిగాడు. దీనికి నిర్వాన్ స్పందిస్తూ ‘మూడు వారలయ్యింది’ అని నిర్వాన్ బదులిచ్చాడు. అలాగే సల్మాన్.. ‘నేను కూడా మూడు వారాల నుంచి నా తండ్రిని చూడలేదు. మనం ఇక్కడ ఉన్నాం. అతను(తండ్రి) ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు’ అని తన ఆవేదనను వ్యక్తం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
previous post
next post