telugu navyamedia
క్రీడలు ట్రెండింగ్ వార్తలు

సన్‌రైజర్స్‌ భారీ షాక్‌.. కీలక ఆటగాడు దూరం !

ఐపీఎల్‌ 2020-21 షెడ్యూల్ ఇప్పటికే‌ రిలీజ్‌ అయింది. ఏప్రిల్‌ 9 నుంచి మే 30 వరకు ఐపీఎల్‌ మ్యాచ్‌లు జరుగనున్నాయి. ప్లే ఆఫ్స్‌తో పాటు ఫైనల్‌ మ్యాచ్‌కు మొతేరా స్టేడియం ఆతిథ్యం ఇవ్వనుంది. మిగతా మ్యాచ్‌లు చెన్నై, ముంబై, కోల్‌కతా, బెంగళూరు, అహ్మదాబాద్‌, ఢిల్లీలో జరుగనున్నాయి. మే 30న మొతేరా స్టేడియంలో ఐపీఎల్‌ ఫైనల్స్‌ జరుగనుంది. ఇది ఇలా ఉండగా.. ఐపీఎల్‌ ప్రారంభం కంటే ముందే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌కు షాక్‌ తగిలింది. సన్‌రైజర్స్‌ కీలక ఆటగాడు విలియమ్సన్‌ మోచేతి గాయంతో బాధపడుతున్నారు. ఈ కారణంగా బంగ్లాదేశ్‌తో జరుననున్న వన్డే సిరీస్‌కు దూరం అయ్యాడు. ప్రస్తుతం విలియమ్సన్‌ గాయంతో బాధపడుతున్నారని న్యూజిలాండ్‌ క్రికెట్‌ బోర్డు కూడా అధికారికంగా ప్రకటించింది. దీంతో సన్‌రైజర్స్‌ యాజమాన్యంలో ఆందోళన నెలకొంది. సన్‌రైజర్స్‌ మిడిల్‌ ఆర్డర్‌ భారాన్ని మోస్తున్న విలియమ్స్‌ జట్టులో కీలక ఆటగాడిగా ఉన్నారు. గాయం కారణంగా విలియమ్‌… హైదరాబాద్‌ తరఫున ఈ ఏడాది ఆడకపోతే జట్టుకు తీరని నష్టం జరుగుతుంది. అయితే… ఐపీఎల్‌ ప్రారంభానికి మరో నెల రోజుల సమయం ఉంది. ఈలోపు విలియమ్సన్‌ కోలుకుంటే… ఐపీఎల్‌లో ఆడే అవకాశాలు లేకపోలేదు. దీనిపై త్వరలోనే క్లారిటీ రానుంది. కాగా.. ఇప్పటికే డేవిడ్‌ వార్నర్‌ గాయంతో అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడు. 

Related posts