యంగ్ రెబల్ స్టార్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఇది ప్రభాస్కు 20వ సినిమా. ఈ సినిమా సెట్స్పై ఉండగానే మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఓ భారీ ప్రాజెక్ట్ సినిమా చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. వైజయంతి మూవీస్ బ్యానర్ పై తెరకెక్కబోతున్న ఈ సినిమా సోషియో ఫాంటసీ జోనర్లో ఉండబోతోందని సమాచారం. ప్రభాస్ రేంజ్కి తగ్గట్టుగా నిర్మాత అశ్వినీదత్ ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా రేంజ్లో భారీ బడ్జెట్తో రూపొందించనున్నారు. అయితే ఈ చిత్రానికి సంబంధించిన కథ ఇదే అంటూ సోషల్ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మానవుడు దేవకన్యకి పుట్టిన పిల్లోడు భూమి మీద ఎలాంటి విన్యాసాలు చెయ్యగలడు అన్న సోషియో ఫాంటసీ కథతో ప్రభాస్-నాగ్ అశ్విన్ సినిమా ఉండబోతున్నట్టు సమాచారం. అయితే తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ మూవీకి మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫిషీయల్గా అనౌన్స్ చేసింది. అంతేకాదు డానీ సంచెజ్ను కెమెరామెన్గా పరిచయం చేసింది చిత్ర బృందం. వీరిద్దరూ సూపర్ హిట్ మూవీ మహానటికి కలిసి పనిచేశారు. వైజయంతి ఫిల్మ్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో దీపికా పదుకొనె హీరోయిన్, బిగ్బీ అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు.
previous post