అగ్ర కథానాయకుడు, పొలిటీషియన్ కమల్హాసన్, శంకర్ కాంబినేషన్లో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోన్న చిత్రం ‘ఇండియన్ 2’. కొన్ని రోజుల ముందు ఈ సినిమా షూటింగ్లో జరిగిన క్రేన్ ప్రమాదంలో ముగ్గురు గాయపడగా.. పది మందికి గాయాలయ్యాయి. ఈ ఘటనపై సీబీసీఐడీ విచారణ సాగుతుంది. ఈ విచారణలో పోలీసులు వేధిస్తున్నారంటూ కమల్హాసన్ మద్రాస్ హైకోర్టులో పిటిషన్ వేశారు. అత్యవసర విచారణకు పిటిషన్ను హై కోర్టు స్వీకరించింది.
previous post