telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

ఈట‌ల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేంద‌ర్‌

Balka suman trs

బీజేపీ నాయ‌కుడు ఈట‌ల రాజేందర్‌ను ఇక నుంచి వెన్నుపోటు రాజేంద‌ర్‌గా పిల‌వాల‌ని టీఆర్ఎస్ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ పిలుపునిచ్చారు. హుజురాబాద్ మండ‌లంలోని 19 గ్రామాల టీఆర్ఎస్ కార్య‌క‌ర్త‌లతో ఏర్పాటు చేసిన సోష‌ల్ మీడియా స‌మావేశానికి ముఖ్య అతిథిగా బాల్క సుమ‌న్ హాజ‌రై మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు ఈట‌ల రాజేంద‌ర్ రాసిన లేఖ నిజ‌మైందేన‌ని, కానీ బీజేపీ ఫేక్ లేఖ‌గా ప్ర‌చారం చేస్తుంద‌న్నారు. బండి సంజ‌య్‌కు ద‌మ్ముంటే ఆ లేఖ ఫేక్ అని హైద‌రాబాద్ భాగ్య‌ల‌క్ష్మి ఆల‌యం వ‌ద్ద ప్ర‌మాణం చేయ‌గ‌ల‌రా? అని బాల్క సుమ‌న్ స‌వాల్ విసిరారు. ఈట‌ల రాజేంద‌ర్ తెలంగాణ ఆత్మాభిమానాన్ని ఢిల్లీలో తాక‌ట్టు పెట్టి, ఢిల్లీ దొర‌ల ద‌గ్గ‌ర మోక‌రిల్లాడు అని విమర్శించారు. ఈట‌ల ఇక నుంచి బీజేపీ రాజేంద‌ర్‌గానే మిగిలిపోతారు అని అన్నారు. త‌న‌కున్న 200 ఎక‌రాల్లో.. ఒక్కో ఎక‌రం అమ్మి ఒక్కో ఎన్నిక‌లో ఖ‌ర్చు పెట్టి గెలుస్తాన‌ని ఈట‌ల చెప్పారు. ఆ డ‌బ్బు సంచుల‌తో వ‌చ్చే బీజేపీ నాయ‌కుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాల‌న్నారు.

Related posts