telugu navyamedia
ట్రెండింగ్ తెలంగాణ వార్తలు వార్తలు

హైదరాబాద్ శివారులో ఘోర ప్రమాదం…ముగ్గురు మృతి

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పట్టణ శివారులోని జాతీయ రహదారి బైపాస్ అన్నారం వై జంక్షన్ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ రోజు తెల్లవారుజామున 6గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. మృతుల వివరాలు ఇంకా పూర్తిగా తెలియరాలేదు. అన్నారం వై జంక్షన్ వద్ద షిఫ్ట్ కారు అతి వేగంతో డివైడర్ ను ఢీకొంటు ఎదురుగా అటువైపు వస్తున్న లారీని ఢీకొన్న సంఘటనలో ఈ ఘోర రోడ్డు ప్రమాదం జరిగినట్లు స్థానికులు చెబుతున్నారు. ఈ సంఘటనలో ఓ బాలుడితో పాటు మరో ఇద్దరు మృతి చెందినట్లు పేర్కొంటున్నారు. సంఘటనా స్థలానికి పోలీసులు చేరుకొని విచారణ జరుపుతున్నారు. ఆదివారం సెలవు రోజు కావడంతో హైదరాబాద్ నుండి జడ్చర్ల వైపు చేపలు పట్టేందుకు సరదాగా వెళుతూ ప్రమాదానికి గురైనట్లు ప్రాధమిక సమాచారం అందింది. వారు ఏ గ్రామానికి వెళ్తున్నారనే సమాచారం తెలియరాలేదు. హైదరాబాద్ నుండి రెండు వాహనాల్లో వీరు బయలుదేరినట్టు చెబుతున్నారు. మరో వాహనంలో వచ్చిన వారు వీరి పూర్తి వివరాలు చెప్పలేదు. సంఘటనా స్థలంలో ఇద్దరు దుర్మరణం పాలవగా చికిత్స పొందుతూ మరొకరు మృతి చెందినట్లు తెలిపారు. ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తోంది.

Related posts