నటి కాజల్ ఒకపక్క నటిస్తూనే మరోపక్క నిర్మాణ సారథ్యం కూడా చేసేందుకు సిద్ధం అయ్యింది. కొత్తగా వచ్చిన హీరోలు కాస్త కుదురుకోగానే సొంత బ్యానర్ ను ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇక నిన్న మొన్నటి వరకూ హీరోయిన్స్ వేరే వ్యాపారాలపై పెట్టుబడులు పెడుతూ వచ్చారు. ఇప్పుడు వాళ్లు కూడా నిర్మాతలుగా మారుతున్నారు. తాజాగా ఈ జాబితాలోకి కాజల్ చేరనున్నట్టు తెలుస్తోంది.
కేఏ మూవీస్ బ్యానర్ పై ఓ సినిమాను నిర్మించడానికి కాజల్ రెడీ అవుతోందట. ఈ సినిమా నిర్మాణ భాగస్వామిగా తమన్నా ఉండనున్నట్టుగా తెలుస్తోంది. కాజల్ .. తమన్నా ఇద్దరూ కూడా మంచి స్నేహితులనే విషయం తెలిసిందే. కాజల్ నిర్మించే ఈ సినిమాకి ప్రశాంత్ వర్మ దర్శకుడిగా వ్యవహరించనున్నాడు. ఆల్రెడీ ఆయన కథ చెప్పడం .. కాజల్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగిపోయాయని అంటున్నారు. కాజల్ నిర్మాతగా కంటిన్యూ అవుతుందా? లేదా? అనేది ఈ సినిమా ఫలితంపై ఆధారపడి ఉంటుందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.
ఆ పెద్దరికం గురువు దాసరితోనే పోయింది: మోహన్ బాబు