దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ. ఎన్టీఆర్ మల్టీస్టారర్ గా తెరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. సినిమాలో రామ్చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్గా నటించారు. ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా అజయ్ దేవ్గణ్, సముద్రఖని, శ్రియ తదితరులు కీలకపాత్రలు పోషించారు.
కీరవాణి సంగీతమందించారు. దాదాపు రూ.450 కోట్ల భారీ బడ్జెట్తో ఈ సినిమా డీవీవీ దానయ్య నిర్మించారు. జనవరి 7న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో ఈ సినిమా విడుదల కానుంది.
RRR మూవీ ప్రమోషన్లో భాగంగా బెంగళూరులో ప్రెస్మీట్ నిర్వహించారు. ఈ క్రమంలో ఇటీవల గుండెపోటుతో మరణించిన కన్నడ పవర్స్టార్ పునీత్ రాజ్కుమార్పై తనకున్న ప్రేమను మరోసారి బయటపెట్టారు యంగ్ టైగర్ ఎన్టీఆర్.
పునీత్ రాజ్కుమార్ 25వ చిత్రం చక్రవ్యూహలో ఒక పాట కూడా ఎన్టీఆర్ పాడారు , ఇది ఇప్పటికే తెలుగు చిత్రసీమలో గొప్ప సంచలనం సృష్టించింది. ఆ విషయాన్ని ఎన్టీఆర్ మీడియా ముఖంగా తెలుపుతూ ‘చక్రవ్యూహ’ చిత్రంలోని గెలయా సాంగ్ను పాడి కన్నీళ్ళు తెప్పించాడు.
పునీత్ లేకుండా కర్ణాటక శూన్యంగా కనిపిస్తోందన్నారు. పునీత్ ఎక్కడున్నా మనపై ఆయన దీవెనలు ఉంటాయన్నారు ఎన్టీఆర్. పునీత్ లేని లోటును ఎవరు కూడా భర్తీ చేయలేరని అన్నారు. వేరే బాష నటులు కూడా పునీత్ని మిస్ అవుతున్నారని తెలిపాడు. అంతేకాకుండా ఈ సాంగ్ ని ఇంకెప్పుడు, ఎక్కడ పాడానని తెలిపారు.. పునీత్ ఎక్కడవున్నా.. ఆయన ఆశీర్వాదం తమపై ఉంటుందని తెలిపారు.
ప్రెస్మీట్కు ముందు పునీత్కు నివాళులు అర్పించింది ఆర్ఆర్ఆర్ చిత్రబృందం. ఈ కార్యక్రమంలో ఎన్టీఆర్తోపాటు దర్శకధీరుడు రాజమౌళి, రామ్చరణ్, బాలీవుడ్ నటి అలియాభట్ పాల్గొన్నారు.