రేపు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఎన్టీఆర్కు జోడిగా ఎవరు నటిస్తారనే రహస్యం ప్రకటిస్తామని చిత్ర బృందం ప్రకటించింది. అంతేకాకుండా ప్రతినాయక పాత్రల గురించి కూడా రేపే అభిమానులందరికి చెబుతామని వెల్లడించింది. సినిమా షూటింగ్ దాదాపుగా 70శాతం పూర్తిచేసినట్టుగా చిత్ర యూనిట్ పేర్కొంది. దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ భారీ మల్టీస్టారర్ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్స్టార్ రామ్చరణ్లు హీరోలుగా నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే. పిరియాడిక్ బ్యాక్ డ్రాప్లో తెరకెక్కుతోంది. రామ్చరణ్.. అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్.. కొమరం భీంగా నటిస్తున్నారు. రామ్ చరణ్ సరసన ఇటీవల గొప్ప పేరుప్రఖ్యాతలు తెచ్చుకున్న బాలీవుడ్ బ్యూటీ అలియా భట్ హీరోయిన్గా నటిస్తుంది.
ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన నటించేందుకు హాలీవుడ్ హీరోయిన్ డైసీ ఎడ్గర్ జోన్స్ ను ఎంపిక చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో డైసీ ఈ ప్రాజెక్ట్ నుంచి తనంతట తానుగా తప్పుకోనుంది. దీంతో అప్పటి నుంచి ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారనే సందేహం అభిమానుల్లో మొదలైంది. అమెరికన్ నటి, గాయని ఎమ్మా రాబర్ట్స్ను ఎన్టీఆర్ సరసన నటిస్తారని పలు పుకార్లు వచ్చాయి.. కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఎవరి పేరును ఇంతవరకు ప్రకటించలేదు. దీనితో ఇంతవరకు ఎన్టీఆర్ పక్కన నటించేది ఎవరా అన్నది సస్పెన్స్ గా మారింది. ఎన్టీఆర్కు జోడీగా జక్కన్న ఎవరిని తీసుకొస్తారనేది రేపు తెలియనుంది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ఫై దానయ్య 300 కోట్ల భారీ బడ్జెట్తో నిర్మిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 30న ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు. దీంతో ఎన్టీఆర్ పక్కన నటించడానికి రాజమౌళి ఎలాంటి ముద్దుగుమ్మను ఎంపిక చేశారో అన్నదానిపై అభిమానులందరికి ఒక క్లారిటీ వస్తుంది.