telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

క్రైస్తవులకు ఏపీ సర్కార్ గుడ్ న్యూస్.. క్షేత్రాలకు వెళ్లే వారికి ఆర్థిక సాయం పెంపు

రాష్ట్రంలోని క్రైస్తవులకు ఏపీ సర్కార్ తీపి కబురు అందించింది. జెరూసలేంతో పాటు ఇతర క్రైస్తవ క్షేత్రాలకు వెళ్తే క్రైస్తవులకు ఆర్థిక సాయాన్ని రూ. 40 వేల నుంచి రూ. 60 వేలకు పెంచుతూ ప్రాభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పెంపు వార్షిక ఆదాయం రూ. 3 లక్షల కంటే తక్కువ ఉండే క్రైస్తవులకు మాత్రమే వర్తిస్తుంది. అంతకంటే ఎక్కువ ఆదాయం ఉన్నవారికి సాయాన్ని రూ. 20 వేల నుంచి రూ. 30 వేలకు పెంచింది. ప్రభుత్వం సాయం పెంచడంతో క్రైస్తవ క్షేత్రాల సందర్శనకు భక్తులు అధిక సంఖ్యలో వెళ్లే అవకాశముంది.

Related posts