telugu navyamedia
తెలంగాణ వార్తలు రాజకీయ వార్తలు

సమ్మె కార్మికుల చట్టపరమైన హక్కు: భట్టి

Batti vikramarka

సమ్మె చేయడం కార్మికుల చట్టపరమైన హక్కు అని సీఎల్పీ నేత భట్టి విక్రమార్కఅన్నారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో ఆర్టీసీ కార్మికుల సమ్మెపై సీఎం కేసీఆర్ అనుసరిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై మండిపడ్డారు. కేసీఆర్ కు అహంకారం తలకెక్కి నియంతలా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. సమస్యను పరిష్కరించడానికి కృషి చేయాలన్నారు. లేకపోతే ఈ పరిస్థితి రాజ్యాంగ సంక్షోభానికి దారితీస్తుందని పేర్కొన్నారు.

విపక్షాలు ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర చేస్తే.. వాస్తవాలు బయటపెట్టాలని డిమాండ్ చేశారు.టీఆర్ఎస్ అనుబంధ సంఘం టీఎంయూనే ప్రభుత్వాన్ని కూల్చడానికి కుట్ర చేస్తుందా అని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో నెలకొన్న ఈ విపత్కర పరిస్థితిపై గవర్నర్, రాష్ట్రపతిని సలహా అడిగే పరిస్థితి వస్తుందని పేర్కొన్నారు.

Related posts