telugu navyamedia
వార్తలు విద్యా వార్తలు సామాజిక

జేఈఈ మెయిన్‌-2020.. పరీక్షా కేంద్రం మార్చుకోవచ్చు

JEE-Main-2020 exams

జేఈఈ మెయిన్‌-2020 పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమకు అనుకూలమైన పరీక్షా కేంద్రాన్ని ఎంచుకోవడానికి అవకాశం కల్పించినట్లు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (ఎన్‌టీఏ) తెలిపింది. విద్యార్థులు తమ దరఖాస్తు ఫారంలో తొలుత నమోదు చేసిన పరీక్షా కేంద్రం ప్రదేశాన్ని మార్చుకోవచ్చని సూచించింది.

ఈ సదుపాయం ఆన్‌లైన్‌లో ఈ నెల 14 వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొంది. కరోనా నేపథ్యంలో రవాణా సదుపాయాలు అందుబాటులో లేకపోవడమే కాకుండా వైరస్‌ వ్యాప్తిని అడ్డుకోవడాన్ని దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నామని ఎన్‌టీఏ వివరించింది.

Related posts