telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

రైతుకు పట్టం కట్టేందుకే జనసేన: పవన్ కల్యాణ్

pawan-kalyan

రైతుకు పట్టం కట్టేందుకే ‘జనసేన’ ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. ‘రైతు సౌభాగ్య దీక్ష’ పేరిట కాకినాడలో జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఒక రోజు నిరసన దీక్ష ముగిసింది. పవన్ కు నిమ్మరసం ఇచ్చిన రైతులు ఆయన దీక్షను విరమింపజేశారు. అనంతరం పవన్ మాట్లాడుతూ ఈ దీక్షకు మద్దతుగా నిలిచిన ప్రతిఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు.

అన్నదాత కన్నీరు ఆగే వరకూ తన పోరాటం ఆగదని స్పష్టం చేశారు. రైతు కష్టపడి పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇవ్వాలని ఈ సందర్భంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు మాయమాటలు చెబుతున్నవాళ్లు బాగున్నారని అన్నారు. రైతులే కన్నీళ్లు కారుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

Related posts