telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘సాక్షి’పేపర్ కథనాల పై లోకేశ్ సంచలన వ్యాఖ్యలు

Minister Lokesh comments YS Jagan

సాక్షి పేపర్ కథనాల పై టీడీపీ నేత నారా లోకేశ్ మరోమారు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ పేపర్ లో రాసే వార్తలన్నీ అబద్ధాలే, అసత్యాలే అని నిండు సభలో సీఎం జగన్ ఒప్పుకున్నారంటూ ఓ పోస్ట్ చేశారు. ఇంత కాలం ఇలాంటి వార్తలు ప్రచురించి ప్రజలను బురిడీ కొట్టించిన ‘సాక్షి’ దొంగ పేపర్ అని ఒప్పుకున్న జగన్ కు అభినందనలు చెప్పకుండా ఉండలేకపోతున్నానంటూ ఎద్దేవా చేశారు.

సాక్షి పేపర్ లో గతంలో ప్రచురితమైన కథనాలు ’చినబాబు తిరుతిండి రూ.25 లక్షలండి!’, ‘ఇక సన్నబియ్యం సరఫరా’,‘డేటా చోర్.. బాబు సర్కార్’, ‘నాలుగేళ్లలో చంద్రబాబు దోపిడీ 6.17 లక్షల కోట్లు’, ‘కారు మబ్బులు’, ‘బాబు అవినీతి ఆకాశయానం’ లను ప్రస్తావిస్తూ జగన్ పై లోకేశ్ వ్యంగాస్త్రాలు సంధించారు.

Related posts