telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నా: జేసీ దివాకర్ రెడ్డి

jc-diwakar-reddy

మాజీ ఎంపీ, టీడీపీ నేత జేసీ దివాకర్ రెడ్డి పోలీసులను ఉద్దేశించి అనంతపురంలో చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై ఏపీ పోలీస్ సంఘం ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో జేసీ వివరణ ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నానని తెలిపారు. కొందరు వరెస్ట్ పోలీసుల పైనే ఆ వ్యాఖ్యలు చేశానని అన్నారు.

పోలీసులు వెన్నెముక లేకుండా వంగిపోతున్నారని, ఏ ఒక్క పోలీసు గురించి తాను వ్యాఖ్యలు చేయడం లేదని సమర్థించుకున్నారు. ఏపీలో మూడు రాజధానుల అంశంపై జేసీ స్పందిస్తూ, అసెంబ్లీ, పరిపాలన విభాగం రెండూ ఒకేచోట పెట్టాలని, వాటిని వేర్వేరు చోట్ల పెట్టే అవివేకుడు జగన్ కాదని అన్నారు.

Related posts