telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటీ?: పవన్ కల్యాణ్‌

pawan-kalyan

గుంటూరులోని మంగళగిరిలో జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ పార్టీ శ్రేణులతో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ‘జగన్ రెడ్డి అని నేను పిలిస్తే మాత్రం వైసీపీ వారు తప్పుబడుతున్నారు. జగన్ రెడ్డి అని పిలిస్తే తప్పేంటీ? అలా పిలిస్తే దురుద్దేశాలు ఆపాదిస్తున్నారు. నన్ను మాత్రం పవన్ నాయుడు అంటూ వైసీపీ నేతలు ఎగతాళి చేస్తున్నారని విమర్శించారు. వ్యక్తిగతంగా వారు ఎంతగా రెచ్చగొట్టినా నేను వారి వ్యక్తిగత జీవితాల గురించి మాట్లాడనని అన్నారు.

వ్యక్తిగత నిందల వల్ల ప్రజల సమస్యలు పరిష్కారం కావు. కులమతాలకు అతీతంగా రాజకీయాలు చేయడమే మా సిద్ధాంతం. ఐదు నెలల్లో చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఇసుక వారోత్సవాలు చేయడం సిగ్గుచేటు’ అని పవన్ అన్నారు. ‘ప్రజలకు ఎలా న్యాయం జరుగుతుందన్న విషయంపైనే మేము దృష్టి పెడతాం. తెలుగు భాషను ప్రభుత్వం విస్మరిస్తోంది. మనది తెలుగు జాతి అన్న భావన పోతుంది. ఏపీలో తెలుగును విస్మరిస్తున్నారు. దీని వల్ల తీవ్ర పరిణామాలుంటాయి’ అని పవన్ పేర్కొన్నారు.

Related posts