వైసీపీ అధినేత వైఎస్ జగన్ మహిళా ద్రోహి అని టీడీపీ అధికార ప్రతినిధి సాధినేని యామిని ఆరోపించారు. ఈ రోజు మీడియాతో ఆమె మాట్లాడుతూ జగన్ కు త్వరలోనే తెలుగు ఆడపడుచులు తగిన గుణపాఠం చెప్పనున్నారని ఆమె అన్నారు. ఎంతో అద్భుతమైన ‘పసుపు-కుంకుమ’ పథకం ద్వారా లక్షల మంది మహిళల మనసులను చంద్రబాబు గెలుచుకున్నారని కొనియాడారు.
మహిళలంతా తమ నేతను తిరిగి సీఎంను చేయడం ద్వారా రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారని యామిని వ్యాఖ్యానించారు. మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలను టీడీపీ సర్కారు ప్రవేశపెట్టిందని, ఈ క్షణం మహిళాలోకం యావత్తూ చంద్రబాబుకు అండగా నిలిచిందని అన్నారు. మడమ తిప్పడంలో ముందున్న పార్టీ వైసీపీయేనని, పక్క రాష్ట్రంలోని కేసీఆర్, కేంద్రంలోని దుర్మార్గుడైన మోదీతో కలిసి రాష్ట్రాభివృద్ధిని అడ్డుకుంటోందని విమర్శలు గుప్పించారు.
స్నేక్ బాబు ఎక్కడ… ? అన్నపూర్ణ స్టూడియో గేటు దగ్గర… నాగబాబుపై శ్రీరెడ్డి వ్యాఖ్యలు