telugu navyamedia
ఆంధ్ర వార్తలు రాజకీయ వార్తలు

‘జగనన్న ఉల్లిపాయల పథకం’ అని పేరు పెట్టుకోండి: పవన్ కల్యాణ్

pawan-kalyan

ఉల్లి ధరకు రెక్కలు రావడంతో ఏపీ సర్కారు చర్యలు చేపట్టింది. ఈ నేపథ్యంలో రూ. 25కి ఉల్లిపాయలను ప్రభుత్వం విక్రయ కేంద్రాల ద్వారా అందిస్తోంది. వీటి కోసం జనాలు పెద్దపెద్ద క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. సంబిరెడ్డి అనే వ్యక్తి క్యూలైన్లో నిలబడి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సీఎం జగన్ అనుభవ రాహిత్యమే ఈ సంక్షోభానికి కారణమని చెప్పారు.

ఉల్లి కోసం జనాలు గంటల తరబడి క్యూ లైన్లో నిల్చోవాల్సిన అవసరం ఏముందని పవన్ ప్రశ్నించారు. ఉల్లి సరఫరా కోసం గ్రామ వాలంటీర్లను ఉపయోగించి… ప్రజల ఇళ్ల దగ్గరికే రూ. 25కి ఉల్లిపాయల సరఫరా ఎందుకు చేయడం లేదని అన్నారు. అవసరమైతే దీనికి ‘జగనన్న ఉల్లిపాయ పథకం’ అనే పేరు పెట్టుకోండని పవన్ ఎద్దేవా చేశారు.మత మార్పిళ్లు, కూల్చివేతలు, కాంట్రాక్టు రద్దుల మీద పెట్టిన దృష్టిని వైసీపీ ప్రభుత్వం ప్రభుత్వం ప్రజలు అవసరాల మీద, రైతుల కష్టాల మీద పెట్టుంటే బాగుండేదని పవన్ హితవు పలికారు.

Related posts