ఐపీఎల్ 2021 కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ విరాట్ కోహ్లీ తాజాగాచెన్నైకి చేరుకున్నాడు. ఈ విషయాన్ని ఆర్సీబీ ట్విటర్ వేదికగా తెలియజేసింది. ఇక ఐపీఎల్ నిబంధనల ప్రకారం విరాట్ ఏడు రోజుల క్వారంటైన్లో ఉండనున్నాడు. ఇటీవల ఇంగ్లండ్తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం నేరుగా జట్టుతో కలిసే అవకాశం ఉన్నా.. విరాట్ బబుల్ ధాటి ఇంటికి వెళ్లాడు. స్వల్ప విరామంతో తర్వాత మళ్లీ ఐపీఎల్ కోసం ఆర్సీబీ ఏర్పాటు చేసిన క్యాంప్ కు చేరుకున్నాడు. దాంతో అతను క్వారంటైన్లో ఉండాల్సి వచ్చింది. ఈ లెక్కన ఏప్రిల్ 9న డిఫెండింగ్ చాంపియన్స్ ముంబై ఇండియన్స్తో జరిగే సీజన్ ఫస్ట్ మ్యాచ్కు ఒక్క రోజు ముందే విరాట్ జట్టుతో కలవనున్నాడు. అయితే ఇటీవల ఇంగ్లండ్తో సిరీస్లో విరాట్ అదరగొట్టడం ఆర్సీబీకి కలిసొచ్చే అంశం. అయితే కోహ్లీ కంటే ముందు ఇప్పటికే చెన్నై చేరుకున్న ఆర్సీబీ జట్టు.. ప్రాక్టీస్ ప్రారంభించింది.
previous post