telugu navyamedia
రాజకీయ వార్తలు

తిరుమలలో కర్ణాటక సత్రంకు సీఎం జగన్ భూమి పూజ

cm Jagan tirumala

ఏపీ , కర్ణాటక రాష్ట్రాల  సీఎంలు వైఎస్ జగన్, యడియూరప్పలు ఈరోజు ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. స్వామి సన్నిధికి వచ్చిన యడియూరప్పకు మహాద్వారం వద్ద వైఎస్ జగన్ స్వాగతం పలికారు. ఆలయానికి ఎదురుగా ఉన్న నాద నీరాజనం వద్ద నిర్వహిస్తున్న సుందరకాండ పారాయణంలో ఇద్దరూ ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.

అనంతరం తిరుమలలో రూ.200 కోట్లతో కర్ణాటక ప్రభుత్వం నిర్మించనున్న నూతన సత్రాల భవన నిర్మాణానికి సీఎం జగన్ భూమి పూజ చేశారు. మైసూరు మహారాజుల సమయం నుంచి తిరుమలలో కర్ణాటక ప్రభుత్వానికి సంబంధించి 7ఎకరాలు భూమిలో నూతన అతిధి గృహాన్ని కర్నాటక ప్రభుత్వం నిర్మించనుంది. శంకుస్థాపన అనంతరం తిరుమల పర్యటనను ముగించుకొని అక్కడి నుంచి రేణిగుంట విమానాశ్రయానికి సీఎం జగన్ పయనమయ్యారు.

Related posts