telugu navyamedia
క్రైమ్ వార్తలు

జమ్మూ కశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఆరుగురు జ‌వాన్లు దుర్మరణం..32 మందికి గాయాలు

*జమ్మూకాశ్మీర్ లో ఘోర ప్రమాదం..
*ఐటీబీపీ జ‌వాన్ల వాహ‌నం లోయ‌లో బోల్తా ప‌డింది..
*ఆరుగురు జ‌వాన్లు దుర్మరణం..32 మందికి గాయాలు

జమ్మూకాశ్మీర్ లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పహ‌ల్గాం వద్ద ఆర్మీ బస్సు లోయలో బోల్తా పడటంతో…అందులో ప్రయాణిస్తున్న ఆరుగురు ఐటీబీపీ జవాన్లు అక్కడికక్కడే మృతిచెందగా మరో 32 మంది గాయపడ్డారు.

అమర్‌నాథ్‌ యాత్ర విధుల కోసం ఇండో టిబెటన్‌ బార్డర్‌ పోలీస్‌ సిబ్బందితో కూడిన బస్సు చందన్వారి నుంచి పహల్గాంకు వెళ్తోంది. పహాల్గాం ఫ్రిస్‌లాన్‌ రోడ్డు వద్దకు చేరుకోగానే ప్రమాదానికి గురైంది. బస్సు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో అదుపు తప్పి.. లోయలో పడిపోయింది.

కాగా..బ‌స్సు ప్ర‌మాదం సమయంలో బస్సులో 37 మంది ఐటీబీపీ సిబ్బంది, ఇద్దరు జమ్ము పోలీసులు సైతం ఉన్నారు. గాయపడిన సిబ్బందని శ్రీనగర్‌ క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. . గాయపడిన వాళ్లలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఇండో టిబెటన్‌ పోలీసులు చెబుతున్నారు.

Related posts