పశ్చిమ బెంగాల్కు చెందిన బీజేపీ ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ రే ఉరేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనతో పశ్చిమ బెంగాల్ రగలిపోతోంది. ఆయన మృతితో 12 గంటలపాటు బంద్కు పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో విధ్వంసం సృష్టించారు. కుచ్బెహర్ ప్రాంతంలో బస్సులు ధ్వంసం చేశారు. రోడ్లు ఎక్కడికక్కడ దిగ్బంధించారు.
మమత బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఈ తెల్లవారుజాము నుంచే పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు చేపట్టారు. బంద్ నేపథ్యంలో మార్కెట్లు మూతపడ్డాయి. బీజేపీ కార్యకర్తల ఆందోళనతో రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను చెదరగొడతున్నారు. ఎమ్మెల్యే దేవేంద్రనాథ్ తన గ్రామ సమీపంలోని బిందాల్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. అయితే అది ఆత్మహత్య కాదని, హత్యేనని బీజేపీ ఆరోపిస్తోంది. ఎమ్మెల్యే మృతిపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.
వైఎస్ఆర్ కమీషన్ల వల్ల ప్రాజెక్టు పనులు ఆగిపోయాయి: దేవినేని ఉమ