telugu navyamedia
రాజకీయ వార్తలు

మన దేశ ఖ్యాతి అన్నివైపులా విస్తరించింది: వెంకయ్యనాయుడు

venkaiah naidu

నిలకడైన ప్రజాస్వామ్య వ్యవస్థ కారణంగా మన దేశ ఖ్యాతి అన్నివైపులా విస్తరించిందని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తెలిపారు. హైదరాబాద్ సైబర్ కన్వెన్షన్ లో నిర్వహించిన ప్రాజెక్ట్ మేనేజ్ మెంట్ నేషనల్ సెమినార్ కు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన ప్రజాస్వామ్యం ప్రపంచంలోనే అత్యంత గొప్పదిగా పేరుతెచ్చుకుందని అన్నారు.

ప్రపంచంలోనే అతి భారీ స్థాయిలో ప్రధానమంత్రి ఆవాస్ యోజన పేరుతో గృహనిర్మాణం జరుగుతోంది భారత్ లోనే అని స్పష్టం చేశారు. ప్రధానమంతి సడక్ యోజన పేరుతో ఆరు లక్షల కిలోమీటర్ల మేర గ్రామీణ రోడ్ల నిర్మాణం జరిగిందని వివరించారు.

Related posts