telugu navyamedia
ట్రెండింగ్ వార్తలు వ్యాపార వార్తలు

గుడ్‌న్యూస్‌ : తగ్గిన పెట్రోల్‌, డీజిల్‌ ధరలు

petrol bunk

మన దేశంలో పెట్రోలు, డీజిల్‌ ధరలు మండిపోతున్నాయి. ఈ ఏడాది మొదటి నుంచే విపరీతంగా పెట్రోలు ధరలు పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో ఏకంగా సెంచరీ కొట్టాయి పెట్రోల్‌ ధరలు. ముఖ్యంగా రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలలో పెట్రోల్‌ రేట్లు భగ్గుమన్నాయి. ఇటు తెలుగు రాష్ట్రాల్లోనూ అదే పరిస్థితి నెలకొంది. తెలంగాణలో కంటే ఏపీలో పెట్రోల్‌ రేట్లు ఎక్కువగా పెరిగాయి. దీంతో పెద్ద ఎత్తున నిరసనలు వెల్లువెత్తాయి. గత ఫిబ్రవరి 27న ఇంధన ధరలు దేశ రాజధాని ఢిల్లీలో ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరగా.. పెట్రోల్‌ లీటర్‌ రూ. 91.17కు చేరింది. ప్రస్తుతం చమురు కంపెనీలు లీటర్‌ పెట్రోల్‌ పై 18 పైసలు, డీజిల్‌పై 17పైసలు తగ్గించాయి. సవరించిన ధరలతో పెట్రోల్‌ లీటర్‌ రూ. 90.99కు చేరింది. కోల్‌కతాలో పెట్రోల్‌ రూ. 91.18, డీజిల్‌ రూ. 84.14 చేరగా.. హైదరాబాద్‌లో పెట్రోల్‌ రూ. 94.61, డీజిల్‌ రూ. 88.67కి చేరింది. దీంతో వాహనదారులకు కాస్త ఊరట లభించింది. అలాగే లీటర్‌ డీజిల్‌కు 17 పైసలు తగ్గడంతో ప్రస్తుతం రూ. 81.30 కి చేరింది. ముంబైలో పెట్రోల్‌ రూ. 97.40, డీజిల్‌ రూ.88.42 కాగా.. చెన్నైలో పెట్రోల్‌ రూ. 92.95, డీజిల్‌ రూ. 86.29కు చేరింది.

Related posts