telugu navyamedia
సినిమా వార్తలు

ఏపీలో రిప‌బ్లిక్ డే రోజు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న..

ఆంధ్ర‌ఫ్ర‌దేశ్‌లో రిప‌బ్లిక్ డే రోజు ఆస‌క్తిక‌ర సంఘ‌ట‌న చోటుచేసుకుంది. విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్‌ మైదానంలో నిర్వహించిన గణతంత్ర వేడుకలు ఘ‌నంగా జ‌రిగాయి. ఈ కార్య‌క్ర‌మానికి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సహా పలువురు ఐఏఎస్‌ అధికారులు పాల్గొన్నారు. ముందు వరుసలో సీఎం.. అధికారులు ఆయన వెనుక కూర్చొన్నారు.

ఈ సందర్భంగా ఏదో అంశంపై మాట్లాడేందుకు సీఎం జగన్‌ పిలవగానే వచ్చిన ముఖ్యమంత్రి ముఖ్య కార్యదర్శి ప్రవీణ్‌ ప్రకాశ్‌ మోకాళ్లపై కూర్చొని ఆయనతో మాట్లాడారు. దీనికి సంబంధించిన ఫోటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఈ సంఘటనపై భిన్న రకాల స్పందన వినిపిస్తోంది

అంతమంది ప్రముఖుల మధ్యలో ఓ ఐఏఎస్​ అధికారి.. అలా మోకాళ్లపై కూర్చొని మాట్లాడటం పలు చర్చలకు తావిస్తోంది. ఆ దృశ్యాలు కెమెరాల కంటికి చిక్కాయి. ప్రస్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.

Related posts