telugu navyamedia
క్రైమ్ వార్తలు

ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి…

New couples attack SR Nagar

మాక్లూర్‌ మండలం రాంచంద్రాపల్లి గ్రామ శివారులో దారుణ హత్యకు గురైన యెండాల రాధ హత్యకేసులో భర్త, అత్తలే ప్రధాన నిందితులుగా పోలీసులు నిర్ధారించారు. మంగళవారం నిజామాబాద్‌ ఏసీపీ శ్రీనివాస్‌కుమార్‌ హత్య కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. నవీపేట మండలం శివతండాకు చెందిన బానోత్‌ రాము ఆంధ్రప్రదేశ్‌లోని ప్రకాశం జిల్లా అర్దవీడుకు చెందిన రాధను ప్రేమించి జనవరిలో నవీపేటలో వివాహం చేసుకున్నాడని, ఆ వివాహం అతని తల్లి పద్మకు ఇష్టం లేదని ఏసీపీ తెలిపారు. కట్నం తేకుండా పెళ్లిచేసుకోవడం ఇష్టం లేని పద్మ పెళ్లయిన తర్వాత రాధను దూషించేదన్నారు. దీంతో రాము, రాధ బతుకు దెరువు కోసం హైదరాబాద్‌ వెళ్లి అక్కడ రూం తీసుకొని బట్టల దుకాణంతో తిరిగి పనిచేశారని, లాక్‌డౌన్‌ నేపథ్యంలో తిరిగి శివ తండాకు వచ్చారని ఏసీపీ తెలిపారు. ఈనెల 24వ తేదీన ఇందల్వాయి వెళదామని చెప్పి ముందస్తు ప్రణాళిక ప్రకారం రాధను ద్విచక్రవాహనంపై రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతానికి తీసుకెళ్లాడని ఇటెందుకు వెళుతున్నారని రాధ ప్రశ్నిస్తే తొందరగా వస్తుందని జవాబు చెప్పారని ఏసీపీ తెలిపారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం వెంట పెట్రోల్‌, కిరోసిన్‌తో రాము, పద్మలు రాంచంద్రాపల్లి అటవీ ప్రాంతంలో రాధపై పోసి నిప్పంటించారని కొద్దిగా కాలి అరుపులు వేయగా బండరాళ్లతో కొట్టి చంపారని ఏసీపీ వెల్లడించారు. రాంచంద్రాపల్లి గ్రామస్థుల సమాచారంతో అక్కడికి చేరుకొని దర్యాప్తు జరపగా అక్కడ దొరికిన పర్సు ఆధారంగా నిందితులను పట్టుకున్నట్లు ఏసీపీ తెలిపారు. శివతండా నుంచి ముగ్గురు వెళ్లి మరుసటి రోజు ఇద్దరే రావడంతో గ్రామస్థుల సమాచారం మేరకు నవీపేట పోలీసులు విచారించగా హత్య చేసినట్లు రాము, పద్మ నేరం అంగీకరించారని ఏసీపీ తెలిపారు. ఈ మేరకు ఇద్దరినీ రిమాండ్‌కు తరలించినట్లు ఏసీపీ తెలిపారు.

Related posts