telugu navyamedia
క్రైమ్ వార్తలు

చెక్ బౌన్స్ కేసులో బండ్ల గణేష్‌కు అరెస్ట్‌ వారెంట్‌ జారీ..

నటుడు, నిర్మాత బండ్ల గణేశ్ సోమవారం నాడు కోర్టుకు హాజరయ్యాడు. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే బండ్లకు ప్రకాశం జిల్లాలోని ఒంగోలు సెకండ్‌ ఏఎంఎం కోర్టు అరెస్ట్‌ వారెంట్‌ జారీ చేసింది.

వివరాల్లోకి వెళ్తే…

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం ముప్పాళ్ల గ్రామానికి చెందిన జెట్టి వెంకటేశ్వర్లు అనే వ్యక్తి బండ్ల గణేష్ తన దగ్గర తీసుకున్న డబ్బులు తిరిగి ఇవ్వడం లేదని ఆరోపిస్తూ 2019లో ఒంగోలులోని రెండో ఏఎంఎం కోర్టును ఆశ్రయించాడు.

తాను ఎన్నో సార్లు ఒత్తిడి చేయగా రూ.1.25 కోట్లకు బండ్ల గణేష్ చెక్ ఇచ్చాడని.. కానీ ఆ చెక్ బౌన్స్ అవ్వ‌డంతో అతను కోర్టును ఆశ్రయించాడు. విచారణకు హాజరు కావాలని కోర్టు పలుసార్లు ఆదేశించినప్పటికీ బండ్ల గణేష్ హాజరుకాకపోవడంతో కోర్టు అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. దీంతో బండ్ల గణేశ్ ఒంగోలు సెకండ్ ఏఎంఎం కోర్టు ఎదుట మధ్యాహ్నంపైన హాజరయ్యారు. ఈకేసును 9వ తేదీకి కేసు వాయిదా వేశారు.

Related posts