telugu navyamedia
క్రైమ్ వార్తలు

నాటకం రిహార్సల్స్‌ చేస్తూ.. నిజంగా ఉరివేసుకున్న బాలుడు

భారత స్వాతంత్ర్య దినోత్సవానికి (ఆగస్టు 15) సందర్భంగా స్కూల్లో పిల్లలు నాటక ప్రదర్శన కోసం రిహార్సల్స్‌ చేస్తున్న సమయంలో అపశృతి చోటుచేసుకుంది. ఈ విషాద ఘటన ఉత్తరప్రదేశ్ లోని బుడౌన్ జిల్లా బాబాత్ గ్రామంలో చోటుచుసుకుంది. ఈ ఘటన జూలై 29 న జరగ్గా విద్యార్థి తల్లిదండ్రులు దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయకపోవడంతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యూపీలోని బాబాత్ గ్రామానికి చెందిన భూరేసింగ్ కొడుకు శివమ్ (10) తన మిత్రులతో కలసి ఉరితీసే సన్నివేశం కోసం ఉరితాడును రెడీ చేయించుకున్నారు. ఆ తాడు గట్టిగా ఉందా లేదా అని దానిని చెక్ చేసేందుకు శివమ్ స్టూలుపైకి ఎక్కాడు. దీంతో అది ప్రమాదవశాత్తు మెడకు ఉరితాడు బిగించుకున్నాడు. అక్కడే ఉన్న విద్యార్థులు కాళ్లను ఆడిస్తుండగా.. భయంతో వాళ్లు కేకలు వేశారు.

ఇరుగుపొరుగున ఉన్న వారు వచ్చి చూడగా బాలుడు ఉరి తాడుకు వేలాడుతూ కనిపించాడు.అతడిని అక్కడ నుంచి దించి చూడగా అప్పటికే ఆ బాలుడి ఊపిరి తీసుకోవడం ఆగిపోయింది. దీంతో ఆ ప్రాంతమంతా కన్నీటిపర్యతం అయ్యింది. తమ కొడుకు శివమ్ భగత్ సింగ్ లా నాటక ప్రదర్శన కోసం ఉరేసుకునే సీన్ రిహార్సల్ చేస్తూ చనిపోయాడన్న విషయం తెలుసుకుని తల్లిదండ్రులు భోరున విలపించారు. తండ్రి భూరేసింగ్ ఆధ్వర్యంలో బంధుమిత్రులు కలసి బాలుడి మృతదేహానికి అంత్యక్రియలు చేశారు. ఆ రోజు విషయాన్ని వాళ్లు పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. తర్వాత అక్కడ జరిగింది చాలామందికి తెలియడంతో జిల్లా ఎస్పీ సంకల్ప్ శర్మ స్పందించి విచారణ చేయించారు. విచారణలో ఘటన జరిగింది వాస్తవమే అని తేలింది. దీంతో ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించినట్లు ఎస్పీ తెలిపారు. ఈ ఘటన జూలై 29 న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Related posts