*ఆన్లైన్ సినిమా టిక్కెట్ల ప్రకియపై ఏపీ హైకోర్టు స్టే విధించింది..
*జీవో 69ను నిలిపివేసిన ఏపీ హైకోర్టు
*సినిమా థియేటర్ల యాజమానులకు ఏపీ హైకోర్టు ఊరటనిచ్చింది
*తదుపరి విచారణ ఈ నెల 7కి వాయిదా
ఏపీ సర్కార్కు హైకోర్టు షాక్ ఇచ్చింది. సినిమా టికెట్ల మొత్తాన్ని ఆన్లైన్లో విక్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నెంబర్ 69ని హైకోర్టు స్టే విధించింది .
రాష్ట్రంలో సినిమాల టికెట్లను ప్రభుత్వమే విక్రయించేలా వైఎస్ జగన్ ప్రభుత్వం గత ఏడాది కొత్త విధానాన్ని తీసుకొచ్చింది. ఈ మేరకు సవరణ చట్టం చేసి, ప్రభుత్వం టికెట్ల విక్రయాలపై ఉత్తర్వులు సైతం జారీ చేసింది. దీని ప్రకారం ఏపీలో సినిమా టికెట్లను రాష్ట్ర ప్రభుత్వమే ఆన్ లైన్ ద్వారా విక్రయిస్తోంది.
అయితే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్నజీవో నెంబర్ 69 ని సవాల్ చేస్తూ థియేటర్ యాజమన్యాలు కోర్టును ఆశ్రయించాయి. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు. మధ్యంతర ఉత్తర్వులిచ్చింది. ఈ కేసును ఈ నెల 27వ తేదీకి కేసు విచారణను వాయిదా వేసింది. దీంతో సినిమా థియేటర్ల యాజమానులకు ఏపీ హైకోర్టు కాస్త ఊరటనిచ్చినట్లైంది.