ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న చిత్తూరు జిల్లాకు చెందిన రైతు… చదువుకుంటోన్న తన ఇద్దరు కూతుళ్లను కాడెద్దులుగా మార్చడాన్ని చూసి చలించిపోయిన నటుడు సోనూ సూద్… ఆ కుటుంబానికి ట్రాక్టర్ పంపిన సంగతి తెలిసిందే. కాగా, తన సొంత జిల్లాకు చెందిన రైతుకు సోనూ సూద్ సాయం చేయడంతో తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు స్పందించారు. సోనూ సూద్కు ట్విట్టర్ ద్వారా కృతజ్ఞతలు తెలిపారు. సోనూ సూద్తో తాను ఫోన్ ద్వారా మాట్లాడినట్టు చంద్రబాబు వెల్లడించారు. ఆ రైతు ఇద్దరి కూతుళ్ల చదువు బాధ్యత తాను తీసుకుంటున్నానని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఈ ట్వీట్కు సోనూ సూద్ స్పందించారు. చంద్రబాబుపై ప్రశంసల వర్షం కురిపించారు. ‘‘నన్ను ప్రోత్సహిస్తూ మీరు చెప్పిన మాటలకు ధన్యవాదాలు సార్. మీ దయా గుణం ప్రతి ఒక్కరిలో స్ఫూర్తిని నింపి ఎదుటివారికి సాయపడేలా చేస్తుంది. మీ మార్గదర్శకంలో లక్షల మంది తమ కలలను సాకారం చేసుకోవడానికి దారులు వెతుక్కుంటారు. మీరు ఇలానే స్ఫూర్తిని నింపుతూ ఉండండి సార్. మిమ్మల్ని త్వరలోనే కలుసుకుంటాను’’ అని సోనూ సూద్ ట్వీట్ చేశారు. కాగా, రైతు నాగేశ్వరరావుకు సోనూ సూద్ చేసిన సాయాన్ని ప్రశంసిస్తూ దర్శకులు క్రిష్ జాగర్లమూడి, మెహర్ రమేష్ ట్వీట్లు చేశారు. ఈ ట్వీట్లకు సోనూ సూద్ స్పందించారు.
Thank you so much sir for all the encouraging words. Your kindness will inspire everyone to come forward and help the needy. Under your guidance millions will find a way to achieve their dreams. Keep inspiring sir. I look forward meeting you soon. 🙏🇮🇳 https://t.co/XruwFx1vy2
— sonu sood (@SonuSood) July 26, 2020