హైదరాబాద్…రెండు దశాబ్దాల ఎదురుచూపు.. కాలం కరిగిపోతుంది.. రిటైర్మెంట్ వయసు దగ్గరకొస్తుంది.. ఎక్కే ఆఫీస్ మెట్లు, దిగే మెట్లకు లెక్కేలేదు. కలవని ఆఫీసర్ లేడు.. అడగని రాజకీయ నాయకుడు లేడు.. ఎంత మందికి విన్నపాలు చేసినా, ఎంత మందికి వంగి వంగి దండాలు పెట్టినా, కోర్టుల చుట్టూ తిరిగి న్యాయం కోసం ఎదురుచూస్తున్న ఎలాంటి ఫలితం లేకుండా పోయిందని 1998 డీఎస్సీ సాధన సమితి రాష్ట్ర అధ్యక్షుడు కే శ్రీనివాస్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. డీఎస్సీ 98 క్వాలిఫైడ్ అభ్యర్థులకు ప్రభుత్వం ఇప్పటి వరకు ఉద్యోగాలు ఇవ్వలేకపోయిందని బాధను కలిగించిందని పేర్కొన్నారు.
నల్గొండ, కరీంనగర్, వరంగల్, ఖమ్మం జిల్లాల పిటిషన్ దారులు అందరికీ ఉద్యోగాలు కల్పించేలా కేబినెట్ నిర్ణయం తీసుకోవాలని ఆయన మరోసారి సీఎం కేసీఆర్కి విజ్ఞప్తి చేశారు. ఈసారి జరుగబోయే మంత్రి మండలి సమావేశంలో ఉద్యోగాల భర్తీపై చర్చించనున్న నేపధ్యంలో డీ ఎస్సీ 98 అభ్యర్థుల సమస్యను ఒక పరిష్కారం చూపాలని ఆయన ఆ ప్రకటనలో వేడుకున్నారు.